Sunday, April 28, 2024

TS: క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క..

ఉట్నూర్, మార్చి 15 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఆద్వర్యంలో గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన గిరిజన క్యాంటీన్ ను శుక్రవారం రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… స్థానిక గిరిజన భవన్ లో గిరిజన క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్లేట్ మీల్స్ 5 రూపాయలు ఉంటుందని, మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు ఉంటుందని అన్నారు. క్యాంటీన్ ఏర్పాటు చేయడం వలన నలుగురు కొలాం గిరిజనులకు ఉపాధి లభించిందన్నారు. శాశ్వత షెడ్డు కోసం టెండర్ ఖరారు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే వేడమ బోజ్జూపటేల్, ఆదిలాబాద్ ఎస్పీ, ఉట్నూర్ ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, ఏవో రాంబాబు, ఏపీవో కనక భీమ్రావు, ఐటీడీఏ ఈఈ రాథోడ్ భీమ్రావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement