Thursday, May 2, 2024

ADB: పట్టపగలే ఎలక్ట్రీషన్ సోముపై హత్యాయత్నం

ఉట్నూర్, మార్చి 15 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని లక్కారం పంచాయతీల్లో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఎలక్ట్రీషన్ గుడిపల్లి సోముపై శుక్రవారం మధ్యాహ్నం హత్యాయత్నానికి పాల్పడ్డారు. జనం తిరుగుతుండగా ఆయన ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలోని రోడ్డుపై నిలడ్డారు.

అయితే గుర్తుతెలియని ఇద్దరు వచ్చి సోముపై దాడి చేసి బ్లేడుతో గొంతుకోసి పరారయ్యారని, అయితే దాడిలో గాయపడిన వ్యక్తి ఎలక్ట్రిషన్ సోము తెలిపారు. వెంటనే అతన్ని ఉట్నూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్సలు చేసి పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి సోమును తరలించినట్లు వైద్య ఉద్యోగులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement