Thursday, May 2, 2024

AP – గిడుగు సూర్యనారాయణ ఆదర్శప్రాయులు – ఎస్​కేబీఆర్ కాలేజీలో చిత్ర పటం ఆవిష్కరణ

అమ‌లాపురం – డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో శ్రీ కోనసీమ భానోజి రామర్స్ కళాశాల( ఎస్​కేబీఆర్​)లో దివంగత గిడుగు సూర్యనారాయణ చిత్రపటాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ వేడుకకు హాజరైన పలువురు వక్తలు సూర్యనారాయణ సేవలను కొనియాడారు. ప్రముఖ న్యాయవాది గిడుగు సూర్యనారాయణ వేద సభల అనురక్తి కలిగిన సహృదయులు అని, ఆయన కళాశాలకు 60వ దశాబ్దంలో సెక్రెటరీ, కరస్పాండెంట్ గా సేవలు అందించారని తెలిపారు. కళాశాల అభివృద్ధి కి ఆయన ఎంతో కృషి చేశారని వివరించారు.

సేవలను గుర్తింపుగా కళాశాలలో ఆయన చిత్రపటాన్ని యాజమాన్యం ఏర్పాటు చేసింది. కుటుంబ సభ్యుల అభిలాష మేరకు కళాశాల పాలక వర్గ మండలి సమావేశ మందిరం నందు ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో కళాశాల అధికారులు, అధ్యక్షులు నడింపల్లి సుబ్బా రాజు, పాలక వర్గ సభ్యులు డి. సత్యనారాయణ రాజు, కళాశాల ప్రిన్సిపాల్​ డాక్టర్​ కుమార శాస్త్రి, గిడుగు సూర్యనారాయణ మనుమలు, ముని మనుమలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ కుటుంబ సభ్యులు కళాశాలకు లక్ష రూపాయలు విరాళం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement