Friday, April 26, 2024

యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి పూజలు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆయన ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి తమ ఇలవేల్పు అని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిన సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని చెప్పారు. యాదాద్రి అద్భుతంగా అభివృద్ధి చేశారన్న మంత్రి ఎర్రబెల్లి.. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామిలు ఆలయ ఉద్ఘాటన చేయనున్నారని అన్నారు. దేశ విదేశాల నుంచి ప్రధానులు, ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు హాజరుకానున్నారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement