Tuesday, May 7, 2024

మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మెన్ రవీందర్ రెడ్డికి మాతృ వియోగం

శామీర్ పేట, జులై 25 (ప్రభ న్యూస్ ): మూడు చింతలపల్లి మండలం జగన్ గూడ గ్రామానికి చెందిన మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీటీసీ ఇర్రి రవీందర్ రెడ్డి మాతృమూర్తి జానమ్మ మంగళవారం తెల్లవారుజామున స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలిసిన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇర్రి రవీందర్ రెడ్డి నివాసానికి వెళ్లి అయన మాతృమూర్తి జానమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

హరి వర్ధన్ రెడ్డి తో పాటు మూడు చింతలపల్లి, శామీర్ పేట, తూంకుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహులు, వైయస్ గౌడ్, జైపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ అఖిలేష్ రెడ్డి, కొల్తూరు గ్రామ సర్పంచ్ శిల్పా యాదగిరి, జగన్ గూడ, కొల్తూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్, నర్సారెడ్డి , నాయకులు ఉద్దెమర్రి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేష్, కొల్తూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ పూరెల్లి జైపాల్ రెడ్డి, కొల్తూరు మాజీ ఎంపీటీసీ వెంకటేష్ , ఓబీసీ సెల్ మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు కోరిపల్లి మహేష్, శామీర్ పేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, నాయకులు వీరారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ప్రహ్లాద్ ,లాల్ గడి మలక్ పేట శంకర్, కె. నరసింహులు, టి. నరసింహులు, నవీన్ చారి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement