Sunday, April 28, 2024

కలెక్టరేట్ ఆవ‌ర‌ణ‌లో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య…

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ ఆగస్ట్ 26: హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మొక్కను నాటి, నీరు పోశారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఒక్కరోజు – ఒక్క కోటి మొక్కలు ‘ నాటే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మేడ్చల్ జిల్లాలో, శనివారం గ్రామీణ ప్రాంతంలోని 61 గ్రామ పంచాయతీలలో డి.ఆర్.డి.ఏ 54 వేల మొక్కలను నాటేందుకు కార్యాచరణను చేపట్టింది. ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో హరి ప్రియ, అటవీ శాఖ జిల్లా అధికారి జానకి రాములు,లా ఆఫీసర్ చెంద్రావతి, సి.పి.వో మోహన్ రావ్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement