Sunday, April 28, 2024

MDK : మెద‌క్‌లో బీఆర్ఎస్‌కు షాక్‌…కౌన్సిల‌ర్లు కాంగ్రెస్‌లోకి జంప్‌…

మెద‌క్ ప్ర‌తినిధి, ప్ర‌భ‌న్యూస్ః మెద‌క్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ త‌గిలింది. బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిల‌ర్‌లు, ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత‌, మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు స‌మ‌క్షంలో వారు పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మైనం పల్లి హన్మంత రావ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావు,మెదక్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందుగుల గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్ లు మేడి కళ్యాణి, వసంత్ రాజ్, జయశ్రీ దుర్గ ప్రసాద్ తో పాటు మాజీ కౌన్సిలర్ విక్రమ్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండ శ్రీనివాస్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement