Sunday, April 28, 2024

Narasapur – కేజీబీవీలో కలుషిత ఆహారం – 20 మంది విద్యార్థులకు ఆస్వస్థత

నిర్మల్ జిల్లా ప్రతినిధి. నర్సాపూర్ ఏప్రిల్ 3 ప్రభా న్యూస్) నిర్మల్ జిల్లాని నర్సాపూర్ మండల కేజీబీవీపీ పాఠశాల మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు వికటించి అస్వస్థతగురయ్యారు. కేజీవీబీ పాఠశాలలోని బుధవారం మధ్యాహ్నం భోజనం వికటించటంతో 20 మంది స్వస్థత గురయ్యారు. అందులోనుండి నలుగురు విద్యార్థులు సాయంత్రం వరకు కోల్కపోవడంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలను నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా విద్య అధికారులు ఆయా పాఠశాల విద్యార్థిని తల్లిదండ్రులు హుటా హుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.. ఇదిలా ఉంటే అస్వస్థకు గురైన విద్యార్థులను వారి తల్లిదండ్రులు వారి నివాస గృహాల్లోకి తీసుకు వెళ్తున్నారు. పలువురి విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రం లోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలు మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్తినిలు భోజనం తిన్న తర్వాత యధావిధిగా క్లాసులకు హాజరయ్యారు,.

సాయంత్రం వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో 15 మంది విద్యార్థులను నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా మరో ఐదుగురిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు,

విద్యార్థినులు అస్వస్థత గురైన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అస్వస్థత విషయం తమకు ఎందుకు తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు .ఆసుపత్రి వైద్యురాలు మాట్లాడుతూ నర్సాపూర్ మండల కేంద్రంలోని మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినుల కోసం గురయ్యారని ఆసుపత్రికి తీసుకొని రా వారికి వైద్యం నిర్వహిస్తున్నామని విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement