Monday, May 13, 2024

ప్రవీణ్‌కుమార్‌పై ఆరోపణలు చేస్తే ఖబడ్దార్

మెదక్‌ : జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘం ఆధ్వర్యంలో బండిసంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్దిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రపన్నతున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. అనంతరం ప్రభుత్వ ఆదీనంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల సమస్యలను కులాలకు, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని పేదల జీవితాలను మారుస్తూ దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటిలోకి పంపి తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఎంతగానో కష్టపడుతున్నారని వారిపై అసత్య ప్రచారాలు ఆరోపణలు మానుకోవాలని వారు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement