Friday, May 10, 2024

ఏసీబీ వలలో ‘ఆనంద్ మోహన్ చక్రవర్తి’

పాల్వంచ ‌ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తాసిల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ రూ. 3,500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన కోటి అరుణ్ సాయి కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ధ్రువీకరణ పత్రం జారీకి జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తి రూ. 3,500 లంచం డిమాండ్‌ చేశాడు. ఆనంద్ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement