Tuesday, July 23, 2024

TS: ప‌వ‌ర్ చూపించండి – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి సురేఖ, కూతురు సుస్మితలతో కలిసి ఓటేసేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఓటు విలువ తెలియజేస్తూ ఓటర్లను చైతన్య పరిచారు.

”మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత. ఆ బాధ్యత అనేది మన దేశ, రాష్ట్ర రూపురేఖలను మారుస్తుంది. మీకు న్యాయం చేస్తారు, సుపరిపాలన అందిస్తారు అని నమ్మకం ఉన్న నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. మన రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో వెళ్ళడానికి మీ ఓటు ఉపయోగపడుతుంది. మీ ఓటు పవర్ చూపించండి. అందరూ ఖచ్చితంగా మీ హక్కును వినియోగించుకోండి” అన్నారు చిరంజీవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement