Monday, April 29, 2024

MDK: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని.. అదనపు కలెక్టర్

ప్రజావాణిలో అందిన ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డి ఆర్ ఓ నగేష్ తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని సూచించారు. తిరస్కరించిన వాటికి సవివరమైన వివరణ ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రజావాణిలో మొత్తం 53 దరఖాస్తులు రాగా, అందులో (18) రెవెన్యూ సంబంధిత సమస్యలు కాగా, (35) పంచాయతీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ, సివిల్ సప్లై, వ్యవసాయ, ఉపాధి, వైద్య ఆరోగ్య తదితర శాఖలకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో
డి.ఆర్. ఓ. నగేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement