Sunday, May 5, 2024

నర్సాపూర్‌ ఎస్‌బీఐలో రూ.5 కోట్లు మాయం

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌లో నిధుల గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.5 కోట్ల వరకు నిధులు మాయమైనట్లు అధికారులు తెలిపారు. నిధుల గోల్‌మాల్‌పై సీనియర్‌ ఉద్యోగిపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా లీవ్‌లో ఉన్న ఉద్యోగి ఆస్తుల వివరాలను ఎంక్వయిరీ టీమ్‌ సేకరిస్తోంది. ఇంకా బ్యాంక్‌ సిబ్బంది వివరాలు వెల్లడించలేదు. నిధులు మాయం కాకవడంతో బ్యాంక్‌ సేవలు నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement