Friday, May 17, 2024

ప‌ల్లోంజీ మిస్త్రీ మ‌ర‌ణం ప‌ట్ల – విచారం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాని నరేంద్ర మోడీ భార‌త వ్యాపార దిగ్గ‌జం , షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ మ‌ర‌ణం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. 93 ఏళ్ల మిస్త్రీ నిన్న రాత్రి ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో భారత వాణిజ్య, పారిశ్రామిక రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పల్లోంజీ మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తను విన్న తర్వాత ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు. భారత వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఆయన ఎంతో చేశారని కొనియాడారు. పల్లోంజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాకమైన ఆయన సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement