Saturday, May 4, 2024

తెలంగాణ‌లో వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

9వ విడత రైతుబంధు అందిస్తున్న సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండల కేంద్రంలో రైతుబంధు పై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 58 వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతన్నల కోసం రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు ద్వార సాగు నీరు అందించి రైతన్నకు వెన్నుదన్నుగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించకపోయిన, విభజన హామీలను కేంద్రం గాలికి వదిలేసినా, సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా కల్పించక పోయినా, ఆత్మ గౌరవంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో వ్యవసాయం పండగ అయిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement