Sunday, May 19, 2024

మనిషికి అసలైన ఐశ్వర్యం!

మనిషి ఏదో కోరుకుంటాడు, కాని ప్రయత్నించ డు. డబ్బు కావాలనుకుంటాడు, కాని శ్రమించడు. పదవి కావాలనుకుంటాడు, అర్హత నార్జించడు. కీర్తి కావా లనుకుంటాడు కాని, వితరణ చేయడు. దైవానుగ్రహం కోరు కుంటాడు, చిత్తశుద్ధితో స్వామిని అర్చించడు. ఫలితమే కోరు కుంటాడు కాని కర్మచేయడు. ‘కర్మ చెయ్యి, ఫలితం సంగతి నేను చూసుకుంటాను’ అన్న గీతాచార్యుడి బోధ తలకెక్కదు. అందుకే మని షి నిరంతరం ఏదో కోల్పోతూ, అసంతృప్తి చెందుతూనే ఉంటాడు. నిరాశా నిస్పృహలకు గురి అవుతూనే ఉంటాడు. సుఖశాంతుల కోసం ఎక్కడో, ఏ వస్తువులోనో వెతుక్కుంటాడు. కస్తూరి మృగం తన నాభిలోనే కస్తూరి పరిమళం ఉంచుకొని ఎక్కడో ఉందని వెదుక్కుంటున్న రీతిగా మనిషి తనలోనే ఉన్న బ్రహ్మా నందాన్ని గ్ర#హంచలేక ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాడు.‘ప్రతి వయసులో ఏది మధురంగా తోస్తుందో అదే విషతుల్యం’ అన్న అవగాహన కల గనంత వరకు మనిషి ఏదో కోల్పోతూనే ఉంటాడు. ఎక్కువ ప్రాపంచిక అవసరాలకు బానిసైన వాడు కడు పేదవాడు. అతి తక్కువ ప్రాపంచిక అవసరాల పట్ల కూడా ఆసక్తి చూపనివాడు అస లైన ఐశ్వర్యవంతుడు. ఒకడు వాక్కు విలువ తెలియక వాచలత్వంతో అపఖ్యాతి పాలవుతాడు. ఒకడు శ్రమించక విలువైన సమయాన్ని చేజార్చుకుంటాడు. ఒకడు దురాలోచనలతో అధర్మ మార్గంలో ప్రయాణిస్తుంటాడు. మరొకడు దుష్ట సాంగ త్యం వల్ల దుర్వ్యసనాలకు దాసోహ మంటాడు. ఇంకొకడు తల్లిదండ్రులు, గురువు లు, బంధుమిత్రులు అందరినీ విరోధులుగా భావించుకొని ఒంటరిగా మిగిలిపోతాడు. ఇది చాలా మందికి జరుగుతున్నదే! తెలిసి ధర్మం తప్పేవారు, తెలియక అధర్మం ఆచరించేవారు సైతం లోకంలో కనిపిస్తారు. మనిషి జీవితం ఎంత అల్పమైనదో, అంత విలువైంది. దీన్ని అపురూప మధురఫలంగా భావించి అనుభవించాలి, అమితమైన సుఖాలిచ్చే వస్తువులు ఎన్నో చుట్టూ ఉ న్నా, ఏమీ లేకపోయినా- తేడా ఏదీ లేదనుకోగలవాడే విజ్ఞుడు. దైవకృపకు అర్హుడు. అంతటి వైరాగ్యం పొందినవాడు ఒక్క సంపూర్ణ మానవుడే కాదు… ఆదర్శ వంతుడైన పురుషోత్తముడు. శ్రీరాముడు తెల్లవారితే పట్టాభిషేక మని తెలిసినప్పుడెలా ఉన్నాడో, తెల్లవారగానే అరణ్యవాసా నికి బయలుదేరాల్సి వచ్చినప్పుడూ అలాగే ఉన్నాడు. పాండవులు సతీసమేతులై అరణ్య వాసం, అజ్ఞాతవా సం చేస్తున్న సమయాన కూడా కుంగిపోక కాలా న్ని సద్వినియోగం చేసుకున్నా రు. వారిలోని ఐ కమత్యం సన్నగిల్లలేదు. తమ కష్టాలకు భూ తుడైన అన్న గారిని పల్లెత్తు మాట అనలేదుధైర్యశాలికి విజయం అందుబాటులో నే ఉంటుంది. స్థితప్రజ్ఞుడికి ఖ్యాతి చేతికే చిక్కుతుంది. సంస్కార శీలికి గౌరవం చెంత కే చేరుతుంది. ముముక్షువుకు దైవదర్శనమే సం ప్రాప్తమవుతుంది. మనిషికి అసలైన ఆనం దాన్ని ఇచ్చేది సంతృప్తి. నిజమైన సుఖాన్ని ఇచ్చేది జ్ఞానం. జీవితాంతం శాంతినిచ్చేది ఆధ్యాత్మిక చింత న. మంచి మరణాన్ని ఇచ్చేది ప్రేమ. ఏది కోల్పోతున్నా వీటిని మాత్రం కోల్పోకూడదు. అప్పుడు ‘ఏదో కోల్పోతు న్నాం’ అన్న దిగులే ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement