Saturday, May 4, 2024

వ్యాక్సిన్‌ వేయించున్న ఎంపీపీ అనిత..

రాయపోల్ : కరోనా టీకాని తప్పనిసరిగా వేసుకోవాలని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్‌ అన్నారు. మండలకేంద్రం రాయపోల్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో కరోనా టీకాని వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement