Thursday, May 2, 2024

MDK: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు..

నిజాంపేట,డిసెంబర్30(ప్రభన్యూస్) మండలం చల్మెడ గ్రామానికి చెందిన తుమ్మల రాకేష్ (22) కల్వకుంట గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మల రాకేష్ రెండు రోజుల నుండి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం చేసుకోమని తండ్రి కిషన్,రాకేష్ ను నిందించగా ఇంట్లో నుండి అలిగి వెళ్లిన అతను మళ్లీ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కోసం గాలిస్తుండగా శనివారం ఉదయం కల్వకుంట గ్రామ శివారులో ఒక వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతుడు రాకేష్ గా గుర్తించారు. విషం సేవించి ఆత్మహత్యచేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement