Tuesday, May 7, 2024

16న జాబ్ మేళా

సంగారెడ్డి జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ కంపెనీలో (03)ఉద్యోగాల భర్తీకి మే, 16న ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు సంగారెడ్డి బైపాస్ రోడ్డులో గల పాత వెలుగు ఆఫీస్ లోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలని,
ఏదేని డిగ్రీ విద్యార్హతలు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. జీతం 18,000/- ల నుండి 50,000/- వేల వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 16న నిర్ణీత సమయంలోగా తమ విద్యార్హతల ధ్రువపత్రాలు,
ఎస్ఎస్ సి మెమో, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో నేరుగా జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 08455-271010 లో సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement