Wednesday, May 15, 2024

ప్ర‌తి ఇంటిపై జెండా ఎగ‌రాలి : ఎమ్మెల్యే మ‌ద‌న్ రెడ్డి

గ్రామ గ్రామాన 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపూర్ మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ సురేష్ గౌడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడేలా ఎగరవేయాలని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement