Monday, May 6, 2024

MDK: డ్రిప్ పైపులను దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు

నిజాంపేట, డిసెంబర్31(ప్రభన్యూస్) మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గ్రామానికి చెందిన గరుగుల సుధాకర్ వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి డ్రిప్ పైపులను దగ్ధం చేశారు. గమనించిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు వెళ్లే లోపే మంటల్లో పూర్తిగా డ్రిప్పు పైపులు ధ్వంసం అయ్యాయి

బాధిత రైతు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 50 వేల వరకు ఆసి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement