Monday, April 29, 2024

పైసా ఖర్చు లేకుండా.. పేద‌ల‌కు డబుల్ ఇళ్లు : మంత్రి హ‌రీష్ రావు

పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నిరుపేదలను కొత్తింట్లోకి తోలడం సంతోషంగా ఉందని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. బుధవారం ములుగు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో లబ్ధిదారులతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల గృహ ప్రవేశం చేయించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నాగిరెడ్డిపల్లి గ్రామ దశదిశ మారిందని, ఇప్పటికే గ్రామాభివృద్ధికై రూ.8.30 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, సాగునీటి, తాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement