Thursday, April 25, 2024

కోమ‌టిరెడ్డి రాజగోపాల్ ప్రజాశాంతి పార్టీలో చేరితే 60 శాతం ఓట్లు పడతాయి : కేఏ పాల్

కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నాన‌ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాజ‌గోపాల్ ప్రజాశాంతి పార్టీలో చేరితే 60 శాతం ఓట్లు పడతాయని కేఏ పాల్ అన్నారు. రాజగోపాల్ ఎప్పటి నుంచో బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ పూర్తిగా పతనమైన పార్టీ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాను గెలిపిస్తానన్నారు. బీజేపీలో చేరితే రాజగోపాల్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement