Friday, May 10, 2024

సీఎం ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు..

హవేళిఘణపూర్‌ : మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకి గురవ్వడంతో ఆయన త్వరగా కోలుకోవాలని శ్రీ లక్ష్మీ నర్సింహ్మస్వామి జక్కన్నపేట ఆలయంలో వైస్‌ ఎంపీపీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ త్వరలో కోలుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సతీష్‌రావు, గ్రామ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కాపు కిషన్‌ రాజేశ్వర్‌రావు, సత్యవర్దన్‌రావు, యాదగిరి, అంజనేయులు, బిక్షపతి, రమేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement