Friday, May 3, 2024

వైభవంగా భద్రాద్రి రామయ్య మహాపట్టాభిషేకం…

భ‌ద్రాచ‌లం : భ‌ద్రాద్రిలో శ్రీరామ‌న‌వ‌మి తిరుక‌ల్యాణ బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా నిత్య క‌ల్యాణ మండ‌పం వ‌ద్ద‌ శ్రీరాముని మ‌హాప‌ట్టాభిషేకం గురువారం మ‌ధ్యాహ్నం వైభ‌వంగా జ‌రిగింది. కొవిడ్ నిబంధనలు కారణంగా భ‌క్తులు లేకుండా వైదిక సిబ్బంది స‌మ‌క్షంలో ఈ క్ర‌తువు నిర్వ‌హించారు నిరాడంబ‌రంగా జరిగిన రాముల‌వారి ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మంలో ముందుగా రాములోరికి . బంగారు కిరీటం, పాదుక‌లు, రాజ‌దండంతో అలంక‌ర‌ణ చేశారు. అనంతరం పట్టాభిషేకం కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణల నడుమ పూర్తి చేశారు.. కాగా, రాత్రి 7 గంట‌ల‌కు స్వామివారి ర‌జ‌త ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. ఇది ఇలా ఉంటే బ్ర‌హ్మోత్స‌వాల దృష్ట్యా 27 వ‌ర‌కు నిత్య క‌ల్యాణాలు ని, పూజ‌లు, తీర్థ ప్ర‌సాదాలు నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement