Friday, April 26, 2024

వివాహిత ఆత్మహత్య..

హవేళిఘణపూర్‌ : మండలంలో తన భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని కలత చెంది తన ఇంట్లోనే ఉరివేసుకొని మరణించిన సంఘటన చోటపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కరోనా సెకండ్‌వేవ్‌లో తన భర్తకు పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని తట్టుకోలేక లక్ష్మీ (36) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి అన్న నారాయణ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి మృతురాలిని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. పోలీస్‌ సిబ్బంది ఏఎస్‌ఐ విటల్‌ గంగరాజు ఘటనాస్థలిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement