Friday, April 19, 2024

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ క్యాంప్..

రామాయంపేట : మండలం కాట్రియాల్‌ గ్రామంలోని రైతు వేదికలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ క్యాంపు ఏర్పాటు చేశామని సర్పంచ్‌ తెలిపారు. ఈ క్యాంప్ ని సర్పంచ్‌, ఎంపిటిసి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని లక్ష్మాపూర్‌ సబ్‌సెంటర్‌ పరిధిలోని గ్రామాలు పర్వతాపూర్‌, దంతెపల్లి, కిషన్‌తండాలోని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన వారు ఆధార్‌కార్డు తీసుకొని వచ్చి సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ.. మాస్కులు ధరించి వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సర్పంచ్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల వైద్యాధికారి డాక్టర్‌ ఎలిజబెత్‌రాణి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ సునంద, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement