Friday, May 10, 2024

ముందస్తు అరెస్టులపై భాజపా నాయకుల ఫైర్

ప్రభ న్యూస్, గుమ్మడిదల : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపుమేరకు బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలనకు వెళుతున్నటువంటి మండల బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల భాజపా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. నిరుపేదలైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానని నమ్మబలికి నేడు వాటిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టకుండానే బడుగు బలహీనవర్గాల జీవితాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఈ విషయమై బాటసింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలనకు వెళుతున్నటువంటి భాజపా నాయకులను కార్యకర్తలను అడ్డుకొని అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

వారు చేసిన పనుల్లో నిజాయితీ లేదు కాబట్టే తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇలా అరెస్టులకు తెగబడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని నిజాయితీగా ఉండాలన్నారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన వారిలో ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, ఓబిసి మండల అధ్యక్షుడు భాజ భాస్కర్ గౌడ్, ఉదయ్ కుమార్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement