Sunday, April 28, 2024

సమస్యలుంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి… ఏసీపీ తులా శ్రీనివాస్

ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు తెలియజేశారు. గురువారం గోదావరిఖని ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సరఫరా చేసినా, విక్రయించినా కేసులు తప్పమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని, ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీకి బదిలీపై వెళ్తున్న ఏసీపీ గిరిప్రసాద్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement