Saturday, May 25, 2024

Green India Challenge: మొక్కలు నాటిన హోంమంత్రి

తన జన్మదినం సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా హోం మంత్రి మహమూద్ అలీ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ నాయకులు ఆజం హలీ, పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement