Wednesday, May 8, 2024

క్రీడలతోనే మానసిక ఆరోగ్యం..

పెద్దమందడి : క్రీడలతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని కొత్తకోట సి ఐ మల్లిఖార్జున రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెల్టురు గ్రామంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయి గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుందని అన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఓటమి నూతన గెలుపునకు నాంది కావాలని అన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యమే కాకుండా మంచి శారీరక దారుడ్యం ఏర్పడుతుందని క్రీడలో రాణిస్తే రాష్ట్రీయ జాతీయ, అంతర్జాతీయలలో గుర్తింపు వస్తుందని, ఉద్యోగాలలో ప్రత్యేక కోటా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ రఘుపతి రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షు రాజా ప్రకాష్ రెడ్డి.సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సతీష్ మాదిగ. చిన్న రఘు వర్ధన్ రెడ్డి కృష్ణ రెడ్డి.. భాస్కర్ రెడ్డి. రవీందర్. ఉదయ్ కుమార్. మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement