నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకే బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను వట్టెం గ్రామానికి చెందిన బాలయ్య గౌడ్ (65), శివకుమార్ గౌడ్ (35)గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్త కూడా చదవండి: ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం ఖాయం