Wednesday, May 15, 2024

కార్యదర్శి మృతికి సంతాపం..

రాజాపూర్‌ : మండల పరిధిలోని రాయపల్లి పంచాయితీ కార్యదర్శి రాజునాయక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో తోటి సహోద్యోగులు ఏర్పాటు చేసిన సంతాప సభలో ఎంపిపి సుశీల రమేష్‌ నాయక్‌ మాట్లాడుతూ… నూతనంగా ఏర్పడిన రాజాపూర్‌ మండలానికి చెందిన పంచాయితీ కార్యదర్శి మృతి ఎంతో బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి మహిపాల్‌ రెడ్డి, ఎంపిడిఓ లక్ష్మీదేవి , వెంకట్రాములు , రాజేష్‌ , వివిధ గ్రామాల పంచాయితీ కార్యదర్శులు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement