Monday, May 6, 2024

మరికల్‌ లో ఘనంగా బోనాలు, ఉత్సవాలు


మహబూబ్‌నగర్‌ : మమ్మల్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడి సల్లంగా సూడు తల్లి అంటూ నవాబ్‌పేట మండల కేంద్రంలోని మరికల్‌ అంబేద్కర్‌ కాలనీలో బక్తులు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా దేవతకు గ్రామానికి చెందిన గీత కార్మికులు , కల్లు ఘటంతో బోనాన్ని సమర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ పాండురంగయ్య , గ్రామ పెద్దలు నర్సింహరెడ్డి, ఎంపిటిసి దగ్గుల రాములమ్మ ఆధ్వర్యంలో ప్రజలు అమ్మవారికి కోడి పుంజులు , బోనాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతియేటా గ్రామానికి చెందిన భక్తులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి శ్రద్దలతో అమ్మవారిని తమ కోరికలు నెరవేర్చాలని , పాడి పంటలు పండి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు తీర్చుకొంటారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు పాండు , పెద్దలు రామయ్య , రామచంద్రయ్య , చెన్నయ్య , డి. నర్సింలు , ఆనంద్‌ , కేశవులు , యువకులు ఛత్రపతి , రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement