Saturday, May 11, 2024

కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎ. కొండూరు – దేశవ్యాప్తంగా మరో సారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గం లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం ఆయన ఎ. కొండూరు లో విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడుతూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తేనే, కరోనా నియంత్రణకు సాధ్యపడుతుందన్నారు. వ్యాక్సిన్ ద్వారానే కోవిడ్ నుండి రక్షణ లభిస్తుందని ప్రతి ఒక్కరూ అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించినట్లయితే కరోనా బారి నుండి కాపాడుకోవచ్చన్నారు. బయట ప్రదేశాల్లో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement