Wednesday, May 15, 2024

గులాబీ గిప్ట్..ఆస్తీ పన్ను చెల్లించాలని రిక్వెస్ట్..

శ్రీకాళహస్తి – పట్టణంలో ఆస్తి పనులు పనులు వసూలు చేయడానికి శుక్రవారం ఉదయం కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ , డి విజయ కుమార్, రెవిన్యూ ఆఫీసర్, నారాయణ రెడ్డి రెవిన్యూ ఇన్స్పెక్టర్ గార్లు ఆస్థి పన్ను బకాయి దారులను గులాబీ పువ్వు ఇచ్చి, ఆస్థి పన్ను చెల్లించమని కోరడం జరిగినది. నాలుగు మాడ వీధులలో ఎక్కువగా బకాయి వున్నావ్యాపార సంస్థలను కలిసి పనులు వెంటనే చెల్లించాలని తెలిపారు. అనంతరం నవయుగ హోటల్, శరవణ సూపర్ మార్కెట్, కోవిడ్ నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహించుటకు తనిఖీ చేయడం జరిగినది. సిబ్బంది మరియు కస్టమర్లు మాస్కులు ధరించవలసినదిగా కోరడం జరిగినది. కోవిడ్ నిబంధనల ప్రకారం లేనిచో జరిమానాలు విధించబడునని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement