Monday, April 29, 2024

కేసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

దేవరకద్ర : తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలకు ముప్పై శాతం పిఆర్‌సి ప్రకటించినందుకు నియోజకవర్గ పరిధిలోని సిసి కుంట మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసిఆర్‌ చిత్రపటానికి ఎంపిపి హర్షవర్దన్‌ రెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాస్‌ , ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ఉపాధ్యాయ , ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలు , ఉపాధ్యాయ సంఘాలు పిఆర్‌సి అమలు చేసినందుకు ప్రభుత్వానికి కృత జ్ఞతలు తెలిపారు. అలాగే ఉద్యోగులకు వయో పరిమితి పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement