Monday, April 29, 2024

నిరుపేద గిరిజన రైతులకు గోవుల పంపిణీ..

పదర : మండల పరిధిలోని రాయల గండి తండాలో తెలంగాణ నందీశ్వర గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో 20 మంది నిరుపేద గిరిజన రైతులకు 40గోవులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అగర్వాల్, పదర జెడ్ పి టి సి రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా జడ్పిటిసి రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అగర్వాల్ ఈ ప్రాంత నిరుపేద రైతులకు గోవుల పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు గోవుల పంపిణీ చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, సురేష్, నరేష్, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement