Saturday, April 27, 2024

యూజీసీ నెట్ పరీక్షలు వాయిదా

యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు మే 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగాల్సి ఉన్నాయి. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వీటిని వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నట్ట కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. సవరించిన తేదీలను పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తామని నెట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అభ్యర్థులు, పరీక్ష నిర్వాహకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement