Sunday, April 28, 2024

రాధే శ్యామ్ కు షూటింగ్ కు రానంటున్న పూజా హెగ్డే ?

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో విక్రమాదిత్య గా ప్రభాస్, ప్రేరణగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమా జులై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందనగా కరోనా కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమాలో కృష్ణంరాజు అలాగే పూజా హెగ్డే లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట.

వయసు రీత్యా కూడా కృష్ణంరాజుకు కరోనా సమయంలో షూటింగ్ చెయ్యటం కష్టం గా మారిందట. అలానే పాండమిక్ కారణంగా పూజా హెగ్డే కూడా సూట్ కి రావడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మిగతా పనులను ఈ లోపు మిగిలిన పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తుందట యూనిట్. ఏదేమైనా కరోనా ప్రభావం తగ్గికపోతే మాత్రం రాధే శ్యామ్ అనుకున్న సమయానికి రావడం కష్టమే .

Advertisement

తాజా వార్తలు

Advertisement