Sunday, May 5, 2024

ఏపీలో కరోనా రక్కసి.. ఒక్క రోజే 35 మంది బలి

ఏపీలో కరోనా రక్కసి కోరలు చాచి విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 35 మందిని బలి తీసుకుంది. గడిచిన 24 గంటల్లో 8 వేలకు పైన కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో 37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరుతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మరణాల్లోనూ మరింత పెరుగుదల నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు.  కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు, కర్నూల్ , ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,472కి పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో 3,116 మంది కొవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,76,987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,15,626 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 53,889 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement