Saturday, May 4, 2024

అవసరమైతేనే షూటింగ్ – చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయం

తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే తప్ప సినిమా షూటింగ్ చేయకూడదని నిర్ణయించింది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటనను విడుదల చేసింది.

అత్యవసర పరిస్థితుల్లో కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ యాభై మంది సిబ్బందితో సినిమా షూటింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ చేయాలని తెలిపింది. సినీ పరిశ్రమ మనుగడ, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement