Saturday, April 27, 2024

సిటీ స్కాన్ ధరలు తగ్గింపు.. రూ.1999కే సిటీ స్కాన్

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో సిటీ స్కాన్ ధరలను నిర్ణయించినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు సిటీ స్కాన్ ధరనే రూ. 1999గా నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఫిల్మ్‌తో సహా రిపోర్ట్ కావాలంటే రూ. 2790 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు సిటీ స్కాన్ ధరలను రూ. 5 వేల నుంచి రూ. 1999కు తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు.

ఇప్పటికే వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలలో సిటీ స్కాన్ ధరను రూ.2 వేలకు తగ్గించారని.. అదే బాటలో మహబూబ్ నగర్ జిల్లాలోనూ తగ్గించినట్లు ఆయన తెలిపారు. సోమవారం నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయని తెలిపారు. కొందరు వైద్యులు 30 నుంచి 40 శాతం సిటీ స్కాన్ రిఫరల్ ఫీజుకు ఆశపడి అవసరం ఉన్నా లేకపోయినా రోగులను ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపిస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement