Tuesday, May 14, 2024

ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

దేవరకద్ర :దేవరకద్ర మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ (320ఏ) ఆధ్వర్యంలో హైద్రాబాద్లోని కర్మన్‌ ఘాట్‌ ఏపి ఆర్‌ గార్డెన్స్‌ లో లయన్స్‌ క్లబ్‌ సుధాకర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మండల పరిధిలోని గుడిబండ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు కిశోర్‌ కుమార్‌ , అలాగే రాజోలి ప్రాథమిక పాఠశాలకు చెందిన సుజితకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ డిస్టిక్‌ గవర్నర్‌ లయన్‌ మనోజ్‌ కుమార్‌ పురోహిత్‌ , ప్రోగ్రామ్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రావు , కో చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి , పిఆర్‌ఓ డా. మహేంద్ర కుమార్‌ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులకు రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌ , జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్‌ , ఎంఈఓ జయ శ్రీ , హెచ్‌ ఎం అబ్దుల్‌ హక్‌ , దేవరకద్ర పిఆర్‌టియు టిఎస్‌ అధ్యక్షుడు పురేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు వారిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement