Saturday, May 18, 2024

జగన్ గారు… చంద్రబాబు గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరట

ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతున్నారు. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. 21నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి,ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు.సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు.అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా,దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది.

తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి జగన్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది.అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు పాడుతారు జగన్ గారు అని విమర్శించారు లోకేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement