Thursday, May 16, 2024

సమ్మెలో పాల్గొన్న బ్యాంకు ఉద్యోగులు

గద్వాల :యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్‌ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె రెండవ రోజు కొనసాగగా ఎస్బిఐ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. గద్వాల పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు నిర్వహించిన సమ్మెలో పలువురు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేది పార్లమెంట్‌లో ఎల్‌ఐసితో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు. దేశంలో ఉన్న సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్‌ చేయడం తగాదన్నారు. బ్యాంకు ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సమితి , పలువురు మద్దతు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement