Tuesday, May 21, 2024

బండలాగుడు పోటీలు

గద్వాల : జిల్లా కేంద్రంలోని 23వ వార్డు తెలుగుపేటలో మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా బిజెపి ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు కబీర్‌దాస్‌ నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన జోడి ఎద్దుల బండలాగుడు పోటీలను బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కె. స్నిగ్దా రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమెను వార్డు ప్రజలు , డిటిడిసి యువత సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి , బిజెపి పట్టణ అధ్యక్షులు బండల వెంకట్రాములు , కౌన్సిలర్‌ పి. త్యాగరాజు , జయ శ్రీ , బండల పాండు , మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు సమంత గౌడ్‌ , బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గోసాయి హరి , తరుణ్‌ , బి జెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్‌ , వార్డు ప్రజలు , డిటిడిసి యూత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement