Saturday, April 27, 2024

అయ్యప్ప దేవాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన

దేవరకద్ర : మండల కేంద్రంలో పుట్నాల బట్టి స్థలం వద్ద అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం కోసం ఎండోమెంట్‌ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఆ స్థలంలో అయ్యప్ప దేవాలయం కడితే ఎంతో మంచిగా ఉంటుందని అయ్యప్ప కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే మండల కేంద్రంలో జరుగుతున్న ఈశ్వర వీరప్పయ్య స్వామి స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు చేరుకుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో ఎండోమెంట్‌ అధికారులు , ఈఈ మల్లికార్జున్‌ రెడ్డి , డిఈ వీరభద్రం , ఏఈ బ్రహ్మయ్య , దేవస్థానం ఈఓ కోమల్‌ , దేవాలయ కమిటీ చైర్‌ పర్సన్‌ రాధిక భాస్కర్‌ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు నర్సిం హా రెడ్డి , మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ సుగుణ శ్రీనివాస్‌ రెడ్డి , ఆంజనేయులు , గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement