Monday, May 6, 2024

లారీ బీభత్సం.. ప‌లు వాహ‌నాలు ధ్వంసం .. ఒక‌రికి గాయాలు

భూపాలపల్లి టౌన్ (ప్రభ న్యూస్) – జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ప్రధాన కూడలికి సమీపంలో జాతీయ రహదారిపై ఇసుక లోడుతో పరకాల వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి ఓ షాపు ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో టూ వీలర్ పార్కింగ్ చేస్తున్న మైపల్లి గ్రామానికి చెందిన ఆర్టిజెన్ కార్మికుడు వెలిషెట్టి రంజిత్ ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావంలో లారీ ముందు భాగంలో రంజిత్ ఇరుక్కున్నాడు. స్థానికులు క్షత గాత్రున్ని బయటకు తీశారు. చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..

అలాగే పార్కింగ్ చేసి ఉన్న రెండు మూడు కార్లు, నాలుగైదు టూ వీలర్లను లారీ ఢీ కొట్టడంతో నుజ్జునుజ్జు అయ్యయి. డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రున్ని స్థానిక 100 పడకల హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement