Sunday, May 19, 2024

తిరుచానూరులో క్యూకాంప్లెక్స్ … తిరుమలలో నెయ్యి తయారీ ప్లాంట్ – టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

తిరుమల – రూ 23.5 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లేక్స్ నిర్మాణం చేయాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది.. అన్నమయ్య భవన్ లో టిటిడి ఛైర్మన్ వైెవి సుబ్బారెడ్డి అధ్యక్ష‌త‌న నేడు పాలకమండలి సమావేశం జ‌రిగింది.. ఈ స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాల‌కు పాల‌క‌మండ‌లి ఆమోద ముద్ర వేసింది.. శ్రీవారి ప్ర‌సాదానికి వినియోగించే నెయ్యి కోసం రూ.5 కోట్ల‌తో ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది..

టిటిడి పాల‌క మండ‌లి నిర్ణయాలు..

4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరశింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకర్యర్దం షేడ్లు ఏర్పాటు ….
2.5 కోట్లతో పిఏసిలో భక్తులు సౌకర్యార్దం మరమత్తు పనులు
24 కోట్ల రూపాయల వ్యయంతో రోండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు
4.5 కోట్ల వ్యయంతో నాణ్యత పరిశిలనకు ల్యాబ్ ఆధునికరణ
శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణంకు 3 కోట్లు కేటాయింపు
3.1 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ది పనులుకు కేటాయింపు
9.85 కోట్ల వ్యయంతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ది పనులుకు కేటాయింపు
2.6 కోట్లు వ్యయంతో తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
శ్రీనివాస సేతు ప్రాజేక్ట్ కి పనులు ప్రాతిపాదికన 118 కోట్లు కేటాయింపు
యస్వీ ఆయిర్వేద కళశాల అభివృద్ది పనులుకు 11.5 కోట్లు కేటాయింపు
రుయాలో టిబి వార్డు ఏర్పాటుకు 2.2 కోట్లు కేటాయింపు
11 కోట్లతో యస్వీ సంగీత కళశాల అభివృద్ది పనులుకు కేటాయింపు
తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం,పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులుకు 1.25 కోట్లు కేటాయింపు
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ని టిటిడి ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పోడిగింపు
టిటిడి ఆస్థులు పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటుకు 1.25 కోట్లు కేటాయింపు
5 కోట్ల వ్యయంతో ప్రసాదాల తయ్యారికి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement